Sunday, April 28, 2024

జస్టిస్‌ కేశవరావు మృతి

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేశవరావు మృతి చెందారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కాగా ఆయన మృతి తో రాష్ట్రంలోని కోర్టులకు ఇవాళ సెలవు ప్రకటించారు. 2017 సెప్టెంబర్‌ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా కేశవరావు సేవలు అందించారు.

అయితే కేశవరావు మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సహా… పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను కేసీఆర్ ఆదేశించారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కేశవరావు అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement