Sunday, April 28, 2024

Kothagudem – రూ. ఒక కొటి 62 ల‌క్ష‌ల విలువైన గంజాయి ప‌ట్టివేత… ఇద్దరి అరెస్ట్

కొత్తగూడెంలో అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రూ. 1.62 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఎస్కే అబ్దుల్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ పట్టణ శివార్లలోని రేగళ్ల క్రాస్‌రోడ్‌లో సాధారణ వాహనాల తనిఖీల్లో ఈ విషయం బయటపడిందని వెల్లడించారు. ట్రక్కులో ప్రత్యేకంగా నిర్మించిన చాంబర్‌లో 650 కిలోల గంజాయిని గుర్తించామని తెలిపారు.

అరెస్టయిన వ్యక్తులు ట్రక్కు డ్రైవర్ సుందర్ రామ్, లారీ క్లీనర్ సురేష్ లను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఇద్దరూ రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని నాగౌర్ తహసీల్‌లోని అలయ్ గ్రామానికి చెందినవారు.. ప్రధాన నిందితుడు రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకు చెందిన ఓం ప్రకాష్ ఆదేశాల మేరకు వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు అడవుల నుంచి గంజాయిని సేకరించినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న వాటిలో లారీ, మూడు మొబైల్ ఫోన్లు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement