Friday, May 3, 2024

ముగిసిన కోటంచ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు.. చివరి రోజు పోటెత్తిన భక్తులు

రేగొండ రూరల్ (ప్రభ న్యూస్): రెండో యాదాద్రిగా పిలుచే జయశంకర్ జిల్లా రేగొండ మండలంలోని కోటంచ‌ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆదివారం నాకబలి నిర్వ‌హించారు. చివరి రోజు సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో రావ‌డంతో పోలీస్ శాఖ అప్రమత్తమై ట్రాఫిక్ ను నియంత్రించింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ హింగె మహేందర్, ఈఓ శ్రీనివాస్, సర్పంచ్ పబ్బ శ్రీనివాస్, సీఐ పులి వెంకట్, ఎస్సైలు శ్రీకాంత్ రెడ్డి, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement