Sunday, May 5, 2024

బోధన్‌ ఘటనపై ఆరా తీసిన హోం మంత్రి.. ప‌రిస్థితిపై డీజీపీతో స‌మీక్ష‌

బోధన్‌ ఘటనపై డీజీపీ మహేందర్‌రెడ్డి, నిజామాబాద్‌ కమిషనర్‌ కేఆర్‌ నాగరాజుతో హోం మంత్రి మహమ్మద్‌ అలీ మాట్లాడారు. పరిస్థితి అదుపులోనే ఉందని, కమిషనర్‌ ఇతర అధికారులు బోధన్‌లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారని డీజీపీ హోంమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థిలపై హోంమంత్రి ఆరా తీశారు. ఘర్షణ వాతావరణాన్ని అదుపు చేసినట్లు డీజీపీ తెలిపారు. హోం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలకు సమానమైన ప్రాధాన్యం ఇస్తూ సెక్యులర్‌ నేతగా ఉన్నారన్నారు. తెలంగాణలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానమైన గౌరవం ఉందన్నారు. పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తతో ఉన్నారని, ప్రజలంతా పోలీసులకు సహకరించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement