Sunday, May 19, 2024

అంబరాన్ని అంటిన “కొమ్మాల జాతర” సంబురాలు

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో “కొమ్మాల జాతర” సంబురాలు అంబరాన్ని అంటాయి. దుగ్గొండి మండల నాయకుల ఆహ్వానంతో జాతర ఉత్సవాల్లో పాల్గొని ప్రభలను జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రారంభించారు. కొమ్మాల జాతర ఉత్సావాల్లో ఆకట్టుకున్న దుగ్గొండి మండలంలోని టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ప్రభలను అలంకరించారు. ప్రజలంతా ఎంతో సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, అష్ట  ఐశ్వర్యాలతో తుల తూగాలని అద్బుతమైన అలంకార ప్రాయమైన ప్రభలతో భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రతి గ్రామం నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో, భారీ అలంకరణతో ప్రభ బండ్లును దుగ్గొండి ప్రజానీకం తరలించారు. ఐదు రోజుల పాటు జరిగే కొమ్మాల జాతర ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరి సహకారంతో విజయవంతం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement