Monday, April 29, 2024

KNR: కరీంనగర్ బస్టాండులో బంధీగా కోడిపుంజు..

ప్రయాణికుడు వదిలేసి వెళ్లిన పందెంకోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ 2 డిపో ముందు అధికారులు తాడుతో కట్టి సంరక్షిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి ఆర్టీసీ బస్సులో ఒక బుట్టలో ఆరు కిలోల కోడిపుంజును తెచ్చాడు. బస్టాండ్ ఆవరణలో ఆ కోడిని వదిలి వెళ్లాడు. ఆర్టీసీ అధికారులు ఆ కోడిని స్వాధీనం చేసుకొని ఆర్టీసీ-2 డిపో ముందు కట్టివేశారు.

వ‌రంగ‌ల్ నుండి వేముల‌వాడ‌కు వెళ్లిన ఆర్టీసీ బ‌స్సులో ఆ కోడి పుంజు ఉంది. క‌రీంన‌గ‌ర్ బ‌స్టాండ్ కు వ‌చ్చిన త‌ర్వాత డ్రైవ‌ర్ బ‌స్సులోని సంచిలో ఉన్న కోడి పుంజును డ్రైవ‌ర్ గుర్తించాడు. ఆ కోడిపుంజును కంట్రోల‌ర్ కు అప్ప‌గించ‌గా డిపోలోని 2డిపో భ‌ద్ర‌త విభాగం జాలిలో ఆర్టీసీ అధికారులు బంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement