Thursday, May 2, 2024

Celebrations – స‌చివాల‌యం వ‌ద్ద కోదండ‌రాం ఆనంద హేల‌…

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సచివాలయం వద్ద బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో పాటు తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. ”ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement