Friday, May 3, 2024

AP: వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై ఏడేళ్ల నాటి కేసు కొట్టివేత..

తిరుపతి (రాయలసీమ ప్రభాన్యూస్ బ్యూరో) : రాయలసీమ ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూధన్ రెడ్డి తదితరులపై రేణిగుంట విమానాశ్రయంలో దౌర్జన్యం చేశారని ఏడేళ్ల క్రితం నమోదైన కేసును ఈరోజు కోర్టు కొట్టివేసింది.


2015 లో రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లినప్పుడు స్వల్ప వివాదం రేగగా.. అక్కడి సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, వారిపైన మరో 16మంది పైన ఏర్పేడు పోలీసు స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. అప్పటి ప్రభుత్వ ఒత్తిడితోనే అక్రమంగా తమపై కేసులు నమోదైనట్టు ఆ నాయకులు ఆరోపించారు. ఆ కేసును విచారించిన విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ రోజు కొట్టివేసినట్టు వారి తరపు లాయర్లు మధుకర్ బాబు, సురేష్, కోటిరెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement