Monday, April 29, 2024

TS : 19న కిషన్ రెడ్డి నామినేషన్…హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఈనెల 19న సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్య‌ర్థిగా కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి నామినేష‌న్‌ను వేయ‌నున్నారు. ఈ నామినేష‌న్‌కు కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజ‌రుకానున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నారు.

అయితే, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 18న రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ రానున్నారు. అలాగే, సికింద్రాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని యాదవ సంఘాలతో సమావేశమయ్యేందుకు ఈ నెల 21న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రాష్ట్రానికి రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement