Sunday, May 19, 2024

బాలుడి కిడ్నాప్‌.. కిడ్నాప‌ర్ల బారి నుంచి చాక‌చ‌క్యంగా త‌ప్పించున్న చిన్నోడు..

జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండల కేంద్రానికి చెందిన పదేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కిడ్నాపర్లు ఓ బాలుడిని హనుమకొండకు కార్లో తీసుకువెళ్లగా ఆ బాలుడు వారి కళ్ళు గప్పి చాకచక్యంగా బయట పడ్డాడు. కుటుంబ సభ్యులు, బాలుడి కథనం ప్రకారం .. రేగొండ మండల కేంద్రానికి చెందిన సునంద మహేందర్ దంపతుల కుమారుడైన డేవిడ్ జాకారంలో చదువుకొని ఇటీవల రేగొండకు వచ్చాడు. సోమవారం ఉదయం డేవిడ్ టిఫిన్ కోసం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని టిఫిన్ సెంటర్ కు వెళ్లగా.. కారులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బాలున్ని ప్రభుత్వ ఆస్పత్రి అడ్ర‌స్ చెప్పాలంటూ కారులో ఎక్కించుకొని వెళ్లారు.

స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్దకు చేరుకున్నాక వారు కారుని ఆపకపోవడంతో బాలుడు ఏడుపులు పెడ‌బొబ్బలు మొదలుపెట్టడంతో కిడ్నాపర్ లు మత్తుమందు ఇచ్చారు. ఆ గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని హనుమకొండ మట్టెవాడ ప్రాంతానికి తీసుకువెళ్లి కారును పక్కన నిలిపేశారు. దీంతో బాలుడు డేవిడ్ స్పృహలోకి వచ్చి కిడ్నాపర్ల కళ్ళుగ‌ప్పి క్షేమంగా బయట పడ్డాడు. ఈ మేరకు బాలుడి కుటుంబ సభ్యులు స్థానిక రేగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement