Thursday, May 2, 2024

తుమ్మలకు మతి భ్రమించింది.. భగ్గుమన్న టీఆర్ఎస్ లీడ‌ర్లు

నేలకొండపల్లి (ఖమ్మం) : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మతిభ్రమించి సొంత పార్టీ నేతలపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ లోని ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అనుచర వర్గం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని వాసవీ భవన్‌ లో పాలేరు నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ 4 మండలాల నాయకుల మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎలక్షన్ల ముందర కమీషన్ల కోసం, వర్క్స్‌ శాంక్షన్‌ చేయించుకొని కమిషన్లు తీసుకొని, వర్కు లకు బడ్జెట్‌ సాంక్షన్‌ చేయించకుండా నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పెద్ద పెద్దర్యాలీలు పెట్టి ప్రజలను, కార్యకర్తలను భయపెడితే ఇక్కడ ఎవరు భయపడరని తుమ్మల నాగేశ్వరరావును హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న అభివృద్ధి జరిగినది.. నిన్నుమించినరాజకీయ ద్రోహి మరొకరు లేరని విమర్శ‌లు చేశారు.

తుమ్మల నాగేశ్వరావుకు వయసు మీద పడినా కొద్ది మతి బ్రమిస్తోంది అని పాలేరు నియోజకవర్గ నాయకులు ఎద్దేవాచేశారు. మేము ఒకటే అడుగుతున్నాం.. పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తా, పోటీ చేస్తా అంటున్నావు, అసలు నీకు ఎవరు టికెట్‌ ఇచ్చారు, ఒకసారి నియోజకవర్గంలో పనికిరావని ప్రజలు ఇంటికి పంపించారు.. అయినా సరిపోలేదా? ఎన్నికలు రాకముందే ప్రకటించుకుంటున్నావేంటి అని తుమ్మ‌ల‌కు గ‌ట్టిగానే రిటార్ట్ ఇచ్చారు టీఆర్ ఎస్ లీడ‌ర్లు.

కార్యక్రమాల్లో నేలకొండపల్లి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య, కూసుమంచి మండల అధ్యక్షుడు వీరయ్య, జెడ్‌ పి టి సి మరికంటి ధనలక్ష్మి , నేలకొండపల్లి వజ్జ రమ్య, కూసుమంచి ఎంపీపీ రూరల్‌ ఎంపీపీ , నేలకొండపల్లి పట్టణ టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు వంగవీటి నాగేశ్వరావు, నేలకొండపల్లి టౌన్‌ సెక్రటరీ గొలుసు రవి, కూసుమంచి మండల నాయకులు, రూరల్‌ మండల నాయకులు నేలకొండపల్లి మండలం నాయకులు, తిరుమలాయపాలెం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement