Monday, May 6, 2024

Khammam: మానవత్వం చాటుకున్న పినపాక జడ్పీటీసీ

పినపాక, ఆగష్టు 29(ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక జడ్పీటీసీ దాట్ల వాసుబాబు సుభద్ర దేవి మానవత్వం చాటుకున్నారు. పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామానికి చెందిన దోడ్డ మౌనిక, ఏడు నెలలు గర్బిణి కావడంతోనరాల విక్నెస్ రావడంతో అక్కడక్కడే కుప్పకూలిపోయింది. అమెను వెంటనే కుటుంబ సభ్యులు వైద్య చికిత్సల కోసం అసుపత్రికి తరలించారు.

నిరుపేద కుటుంబం కావడంతో, వైద్య చికిత్స చేసుకోవడానికి డబ్బులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక జడ్పీటీసీ దాట్ల వాసుబాబు,సుభద్రా దేవి భాదితురాలు వైద్యం కోసం పదివేల రూపాయలను కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇనుకుర్తి నాగలక్ష్మి, వార్డ్ మెంబర్స్ సతీష్, గంగరాజు, బీఅర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తోండారపు నరేష్, పంచాయతీ కార్యదర్శి అనూష, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement