Saturday, April 27, 2024

KHM: పల్టీ కొట్టిన ఆటో ట్రాలీ… 8మందికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రానికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం అయిన వెలేరు గ్రామంలో ఇవాళ ఉదయం అదుపుతప్పి ట్రాలీ ఆటో పల్టీ కొట్టిన క్రమంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

గాయపడిన వారిని 3 కిలోమీటర్ల సమీపంలో ఉన్న బూర్గంపహడ్ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన భద్రాచలం అసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి చేతులు విరగడంతో వారిని సైతం భద్రాచలం ఆసుపత్రి తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామ యువకులు వారికి సహకారం అందించి ధైర్యం చెప్పి వారి వెంట ఉన్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement