Saturday, May 11, 2024

ఆర్టీసీ గరుడ బ‌స్సులో మంట‌లు

ఖమ్మం జిల్లా వైరాలో ఆర్టీసీ గరుడ బస్సుకు మంటలు వ్యాపించాయి. హైదరాబాద్ నుంచి 20 మంది ప్రయాణికులతో భద్రాచలం వెళ్తున్న బస్సు… వైరా ప్రధాన కూడలి వద్దకు రాగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. స్థానికులు గమనించి డ్రైవర్ కు తెలపగా…. బస్సు ఆపేలోపే మంటలు వ్యాపించాయి. వెంటనే ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు పెట్టారు. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడంతో బస్సు పూర్తిగా దగ్ధం కాకుండా నివారించారు. ప్రయాణికులు క్షేమంగా బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement