Monday, April 29, 2024

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి.. ఒకరు మృతి.. ఎనిమిది మందికి గాయాలు..

ఖమ్మం : ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం పార్టీ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా అపసృతి చోటు చేసుకున్నాయి. ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, ఇతర నాయకులకు ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు టపాసులు పేల్చగా.. పక్కనే ఉన్న పూరిగుడిసెపై బాంబులు పడ్డాయి. ఇంటిపై నిప్పుపడి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ బండ పేలింది. ఈ ప్ర‌మాదంలో ఒకరు మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఊహించని పరిణామంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement