Thursday, April 25, 2024

వ్యవసాయ కళాశాల ప్రారంభించిన స్పీక‌ర్ పోచారం, మంత్రులు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భవన సముదాయాలను పరిశీలించారు. మంత్రుల వెంట అతిథులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్ బాబు, రసమయి బాలకిషన్‌, సుంకె రవి శంకర్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement