Sunday, May 19, 2024

బీజేపీ ఓట‌మి జ‌ర్నీ మొద‌లైంది : కూనంనేని సాంబశివరావు

దేశంలో బీజేపీ ఓట‌మి చెంద‌డం ఖాయ‌మ‌ని, ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త మొద‌లైంద‌ని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఉన్న పరిశ్రమలను బీజేపీ అమ్మకాలకు పెట్టిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీని నిలువరించడానికే టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే 119 నియోజకవర్గ పరిధిలో సీపీఐ పార్టీని బలోపేతం చేయడానికి టీఆర్ఎస్‌ పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు గెలుపొందేందుకు సీపీఐ కృషి చేస్తుందని వెల్లడించారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన ద‌ళిత‌బంధు ప‌థ‌కం ల‌బ్ధిదారులు ఎంపిక ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించాల‌ని ఆయ‌న కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement