Friday, May 17, 2024

KHM: భాజపా భద్రాచలం అభ్యర్థి కుంజా ధర్మా

భద్రాచలం, అక్టోబర్ 22(ప్రభ న్యూస్): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం బీజేపీ అభ్యర్థిగా మాజీ జెడ్పీటీసీ, దివంగత కుంజా సత్యవతి భర్త కుంజా ధర్మా పేరు ఖరారైంది. ఆదివారం బీజేపీ విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు వుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా 2009లో విజయం సాధించిన ఆయన భార్య కుంజా సత్యవతి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా వున్నారు. ఆమెకు సీటు ఖాయం అనుకుంటున్న సమయంలో ఇటీవల ఆమె మృతిచెందారు. ఆమె మరణంతో ధర్మాను అభ్యర్థిగా ప్రకటించారు.

సీపీఎం పార్టీలో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ధర్మా ఆ పార్టీలో పలు కీలక పదవులు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుతం బీజేపీలో వున్నారు. కుంజా ధర్మా వయస్సు 58ఏళ్లు. ఇంటర్ మీడియట్ వరకు చదివిన ఆయన 1980 నుంచి 94 వరకు సీపీఎం అనుబంధ సంఘాలైన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐల్లో పనిచేశారు. 1994 నుంచి 2000 ఏడాది వరకు ఆల్ ఇండియా అగ్రికల్చర్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, 2001 దుమ్ముగూడెం జెడ్పీటీ సీగా, 2006 నుంచి 2008 వరకు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement