Sunday, April 28, 2024

TS | పోలీసుల‌ తనిఖీల్లో 138 కిలోల గంజాయి పట్టివేత..

అశ్వాపురం, ప్రభ న్యూస్ : అశ్వాపురం మండలం గొల్లగూడెం ప్రధాన రహదారిపై సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించారు. కాగా, త‌నిఖీల్లో 34 లక్షలు విలువ చేసే 138 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ గంజాయిని చింతూరు నుంచి అశ్వాపురం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి ఉన్న కారును స్వాధీనం చేసుకుని, దానికి సంబంధించిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement