Tuesday, May 14, 2024

మంత్రి పువ్వాడ‌కు అతిథులుగా చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య షూటింగ్ ప్రస్తుం ఇల్లెందు ఓపెన్ కాస్ట్ గనులలో షూటింగ్ జరుపుకుంటున్నది..చిరంజీవితో పాటు, రామ్ చరణ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.. ఇది ఇలా ఉంటే ఖమ్మం జిల్లాలో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కి అతిథ్యం ఇచ్చారు.. షూటింగ్ కోసం వచ్చిన ఈ ఇద్దరు హీరోలు పువ్వాడ అజయ్ ఇంటిలోనే బ‌స చేశారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ ప‌లు ఫొటోలు షేర్ చేశారు మంత్రి పువ్వాడ‌. ఖమ్మంలోని మా ఇంటికి అతిధిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌రణ్‌కు స్వాగతం. ఆచార్య చిత్రం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఎంపిక చేయడం సంతోషకరం అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు పువ్వాడ‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement