Sunday, April 28, 2024

TS : నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ కథనభేరి… పాల్గొననున్న కేసీఆర్

లోక్ సభ ఎన్నికల పై బీఆర్ఎస్ దృష్టి సారించింది. మెజార్టీ ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ సభ నిర్వహించబోతుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు.

- Advertisement -

కాగా, గులాబీ దళానికి కంచుకోట అయిన కరీంనగర్లో ఇవాళ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కరీంనగర్‌లో రెండో సభ నిర్వహించబోతున్నారు. ఏ పథకమైనా ఉద్యమమైనా కరీంనగర్‌ నుంచి ప్రారంభించి కేసీఆర్ విజయం సాధించారని.. అందుకే అదే సెంటిమెంట్‌గా ఎస్ఆర్ఆర్ మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీకి పూర్వ వైభవం తేవడంతో పాటూ.. కార్యకర్తల్లో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కరీంనగర్ నుంచి కధన భేరి పేరుతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement