Tuesday, April 30, 2024

గిరిజ‌న యోధుడు బిర్సా ముండాకు కేసీఆర్ నివాళి

ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు. స్వరాజ్యం కోసం, ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం కోసం, వారి హక్కుల కోసం పోరాడుతూ అతిచిన్న వయస్సులో ప్రాణత్యాగం చేసిన బిర్సాముండా.. దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు కేసీఆర్‌. తెలంగాణ స్వయం పాలనలో గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ వారి అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నదని సీఎం కెసిఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement