Friday, May 10, 2024

గ‌జ్వేల్ లో ఈట‌ల పోటీ … ఓట‌మి భ‌యంతోనే కెసిఆర్ కామారెడ్డికి ప‌రుగు …ఎంపి అర‌వింద్

నిజ‌మాబాద్ – బిజెపి అభ్య‌ర్ధిగా గ‌జ్వేల్ లో ఈట‌ల రాజేంద‌ర్ పోటీ చేయ‌నున్న‌ట్లు తాము ప్ర‌క‌టించ‌డంతోనే కెసిఆర్ లో ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని బిజెపి ఎంపి ధ‌ర్మ‌పురి అర‌వింద్ అన్నారు.. కెసిఆర్ గ‌జ్వేల్ తో పాటు కామారెడ్డిల‌లో పోటీ చేస్తుంటంపై ఆయ‌న స్పందిస్తూ, కెసిఆర్ కి రెండు చోట్ల ఓట‌మి ఖాయ‌మ‌న్నారు.. తమ పార్టీకి చెందిన ఈటల రాజేందర్ గజ్వేల్‌కు వస్తున్నానని చెప్పడంతో దడ పుట్టిందన్నారు. కామారెడ్డికి కెసిఆర్ వెళ్ల‌డం గజ్వేల్ ప్రజలను అవమానించినట్లేన‌ని,, వారిపై కేసీఆర్‌కు నమ్మకం లేనట్లే అన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి గజ్వేల్ నుంచి పారిపోయి కామారెడ్డికి వస్తున్నాడన్నారు. కేసీఆర్ ఇంకాస్త ముందుకు వస్తే తన నియోజకవర్గం ఉందన్నారు. నిజామాబాద్‌లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడింటిని బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఆ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాను చూసిన తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని ధర్మపురి అర్వింద్ అన్నారు. సాక్షాత్తు ముఖ్య‌మంత్రి ఓట‌మి భ‌యంతోనే రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నాడంటే మిగతా బీఆర్ఎస్ అభ్యర్థుల పరిస్థితి ఊహించుకోవాలన్నారు. బిఆర్ఎస్ అధినాయుకుడికే ఈ ప‌రిస్థితి ఉంటే మిగ‌తా స్థానాల‌లో బిఆర్ఎస్ అభ్య‌ర్ధులు త‌మ ప‌రిస్థితి ఏమిటో తెలుసుకోవాల‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement