Friday, May 3, 2024

దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్‌ రాణించాలి.. వైష్ణోదేవి ఆలయంలో ఎంపీ వెంకటేశ్‌ నేత పూజలు

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): భారతదేశ రాజకీయాల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాణించాలని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేత ఆకాంక్షించారు. శుక్రవారం జమ్మూలోని హిమాలయాల్లో ఉన్న శ్రీ వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించిన ఎంపీ వెంకటేశ్‌ నేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో రాణించడంతోపాటు భారత దేశాన్ని ప్రపంచానికి దిక్సూచిగా నిలపాలని కోరుకున్నారు.

తన పాలన దక్షతతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా మలిచిన సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోనూ రాణించాలని వైష్ణో దేవిని వేడుకున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజలకు సేవలందించాలన్నారు. ఎంపీతోపాటు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement