సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు ఇప్పుడు దోస్తులయ్యారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిన్న కేసీఆర్ మాట్లాడినవన్నీ అవాస్తవాలేనన్నారు. కేసీఆర్ ఈ దేశ పౌరుడు కాదు.. దేశ ద్రోహి అన్నారు. నెక్ట్స్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కేసీఆర్ ను తీసుకొని వెళ్లమని చెబుతానన్నారు. సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు దేశమంతా పండుగ చేసుకుందన్నారు. కానీ కేసీఆర్ మాత్రం అలా జరగలేదని అంటున్నాడన్నారు. మరి కేసీఆర్ ఏ దేశానికి మద్దతు పలుకుతున్నాడని అన్నారు. కేసీఆర్ దేశంలో ఉండాల్సిన పనిలేదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital