Sunday, April 28, 2024

KCR: ఫామ్ హౌస్ నుండి క‌రీంన‌గ‌ర్ పొలంబాట‌కు బ‌య‌ల్దేరిన కేసీఆర్

గజ్వేల్, ఏప్రిల్ 5 (ప్రభ న్యూస్) : కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు. సిద్ధిపేట జిల్లామర్కుక్ మండలం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వెళ్లారు.

బస్సు ఎక్కేటప్పుడు జై కేసీఆర్ అంటూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ వెంట జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement