Saturday, May 4, 2024

‘మహానాయకుడు’ కేసీఆర్: హరీష్ రావు

హైదరాబాద్ లోని హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఘనంగా జరుగుతోంది. కార్యక్రమానికి చాలా మంది గులాబీ సైనికులు తరలి వచ్చారు. అయితే, పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు మాత్రం కనిపించ లేదు. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన ప్రచారంతో బిజీగా ఉన్నారు. ఉపఎన్నిక బాధ్యతను సీఎం కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించడంతో ఆయన హుజురాబాద్ ను వీడడం లేదు. ఈ నేపథ్యంలో ప్లీనరీ సమావేశానికి కూడా హాజరు కాలేదు. అయితే, కేసీఆర్ మహానాయకులు అంటూ హరీష్ రావు కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైనా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ అని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకుందని హరీష్ రావు తెలిపారు.

ఇది కూడా చదవండి: దళిత బంధు ఆగేది లేదు.. ఈసీపై కేసీఆర్ ఫైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement