Thursday, May 2, 2024

TS : జ‌గిత్యాల‌కు మాజీ సీఎం…ఎమ్మెల్యేను ప‌రామ‌ర్శించ‌నున్న కేసీఆర్

మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ జ‌గిత్యాల‌కు వెళ్ల‌నున్నారు. ఇటీవ‌ల జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్‌కుమార్ తండ్రి, సీనియ‌ర్ న్యాయ‌మూర్తి మాకునూరి హ‌నుమంత‌రావు మృతి చెందారు. ఈ నేప‌థ్యంలో నేడు జరిగే 13వ రోజు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శిస్తారు.

- Advertisement -

ఇక అటు గులాబీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈనెల 13వ తేదీ న చేవెళ్ల సభ నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టం ఉన్నారు. బస్సు యాత్రలు అలాగే బహిరంగ సభలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కెసిఆర్ భావిస్తున్నారట. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని నియోజకవర్గాలు… తిరగాలని యోజనలో కేసీఆర్ ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాభవాన్ని తొలగించి… జనాల్లో మళ్ళీ ఎప్పటిలాగే నిలిచిపోవాలని గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్లాన్ వేస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement