Tuesday, May 21, 2024

TS | 4న కాంగ్రెస్‌ పీఏసీ సమావేశం.. హాజరుకానున్న కేసీ వేణుగోపాల్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ( పీఏసీ) సమావేశం శనివారం గాంధీభవన్‌లో జరగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే హాజరుకానున్నారు. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపైన చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి, ఎన్ని నియోజక వర్గాల్లో బలంగా ఉంది.. బలహీనంగా ఉన్న నియోజక వర్గాలెన్ని అనే వాటిపైన చర్చించే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ పార్టీలో చేరికల అంశంతో పాటు నాయకుల మధ్య నెలకొన్న విభేదాలపైన కూడా చర్చించి.. సమన్వయంతో పని చేసే విధంగా కేసీ వేణుగోపాలు సూచనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం పీసీసీ ప్రచార కమిటీ సమావేశం కూడా కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో జరగనుంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ప్రచార కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement