Thursday, May 2, 2024

కార్పొరేట్ స్కూల్ లను తలదన్నేలా సర్కార్ బడులు

జగిత్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ద్వారా ఆమోదించబడిన అండర్ టేకింగ్ సర్టిఫికెట్స్ సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ పేద విద్యార్థలందరికీ కార్పొరేట్ స్థాయిలో విద్యా అందించాలని మన ఊరు మన బడి అనే కార్యక్రమన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారన్నారు. విద్యా వ్యవస్థ పటిష్ఠతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన కల్పించాలని ప్రధానోపాధ్యాయులను సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement