Sunday, May 5, 2024

TS: వృద్ధురాలి దారుణ హత్య

వృద్ధురాలు దారుణ హత్యకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా చందపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. చందపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి రాజమ్మ (90) ను తలపై రాడ్ తో బలంగా కొట్టి హతమార్చారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసీపీ మహేష్, సిఐ అనిల్, ఎస్సై మహేందర్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రాజమ్మను బంధువులే హతమార్చారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement