Friday, May 17, 2024

TS | బండి సంజయ్ కి షాక్.. కాంగ్రెస్ లోకి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరీంనగర్ భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పార్టీ మారనున్నారు. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అన్ని తానై వ్యవహరిస్తున్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యర్థి పార్టీల ప్రధాన నాయకుల పై ప్రత్యేక దృష్టి సారించారు.

ఇందులో భాగంగానే శ్రీరామ్ చక్రవర్తిని పార్టీలోకి ఆహ్వానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి బిజెపి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బిజెపిని వీడొద్దని శ్రీరామ్ చక్రవర్తికి స్వయానా అక్క బిజెపి రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ ఎంత వారించినా వినకుండా పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో 8 మంది కార్పొరేటర్లు, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement