Friday, May 3, 2024

తిరుగులేని రాజకీయ శక్తి టిఆర్‌ఎస్ : ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

టిఆర్‌ఎస్‌ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తి అని, దేశానికి ఆదర్శంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిలుస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే, జిల్లా టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్‌ అన్నారు. బుధవారం 34వ డివిజన్‌లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి చేతుల కోటేశ్వర్‌, బీజేపీ నాయకులు మాతంగి జయపాల్‌తో పాటు 50మంది రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణాలో ప్రజాహిత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నుండి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారన్నారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నేతృత్వంలో పెద్దపల్లి జిల్లాలో అధిక సంఖ్యలో టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారన్నారు. పెద్దపల్లి జిల్లాలో టిఆర్‌ఎస్‌ పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు చేతుల కోటేశ్వర్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ రామగుండం నియోజకవర్గం సమన్వయ కమిటి సభ్యునిగా ఎమ్మెల్యే నియమించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక సంస్థ మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌, కార్పొరేటర్లు జంజర్ల మౌనిక రాజు, బాలరాజ్ కుమార్‌, ఇంజపురి పులేందర్‌, కొమ్ము వేణుగోపాల్‌, దొంత శ్రీనివాస్‌, సాగంటి శంకర్‌, నాయకులు తానిపర్తి గోపాల్‌రావు, కల్వల సంజీవ్‌, ఓదేలు తదిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement