Saturday, May 4, 2024

ట్రాఫిక్ పోలీసుల సేవలను గుర్తించాలి: కరీంనగర్ సీపీ సత్యనారాయణ

మండుటెండల్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను గుర్తించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీసులకు లైఫ్ లైన్ ఆస్పత్రి వారిచే కూలింగ్ గ్లాసెస్, కరీంనగర్ డెయిరీ వారిచే మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తమ సిబ్బంది మండుటెండల్లో సైతం సేవలందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ విజయ్ కుమార్, లైఫ్ లైన్ ఆస్ప‌త్రి ప్ర‌తినిధి ప్రశాంత్ తో పాటు కరీంనగర్ డెయిరీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement