Thursday, April 25, 2024

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం.. కరీంనగర్ సిపి సుబ్బారాయుడు

శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు పేర్కొన్నారు. గురువారం సీపీగా బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ సిపిగా బాధ్యతలు నిర్వహించిన సత్యనారాయణ నుండి సుబ్బారాయుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 24 గంటల పాటు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

ప్రజలు సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన సిపి కి డిసిపిలు శ్రీనివాస్, చంద్రమోహన్, ఏసీపీలు తులా శ్రీనివాసరావు, తాండ్ర కరుణాకర్ రావు, ఎస్బిఐ వెంకటేశ్వర్లు తోపాటు పలువురు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement