Friday, April 19, 2024

రామానాయుడు స్టూడియోలో.. సైంధవ్ పూజా కార్యక్రమాలు

హీరో వెంకటేశ్ 75వ చిత్రంగా తెరకెక్కుతోంది సైంధవ్. కాగా ఈ సినిమా పూజాకార్యక్రమాలు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సైంధవ్‌లో బాలీవుడ్ టాలెంటెడ్‌ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలియజేస్తూ.. ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఇండియాలో ఉన్న వన్‌ ఆఫ్ ది బెస్ట్‌ యాక్టర్‌తో పనిచేయడం చాలా ఎక్జయిటింగ్‌గా ఉందని శైలేష్‌ కొలను ట్వీట్ చేశారు.. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో నవాజుద్దీన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగచైతన్య, రానా దగ్గుబాటి, రాఘవేంద్రరావు, దిల్ రాజు, నాని, అనిల్ రావిపూడి, సురేశ్‌ బాబుతోపాటు నవాజుద్దీన్‌ సిద్దిఖీ కూడా పాల్గొన్నారు.నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement