Friday, May 3, 2024

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ : మంత్రి గంగుల

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని, రజకులపట్ల గత ప్రభుత్వాలు వివక్ష చూపించాయని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ 4వ డివిజన్ లో రూ.2 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక దోభీఘాట్ నిర్మాణ పనులను ఆయ‌న ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. గ‌తంలో బట్టలు ఉతకాలంటే ఇబ్బందులు పడాల్సిన వ‌చ్చేద‌ని, స్వయం పాలనలో రజకుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. దొరల అరాచకానికి వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మను గత పాలకులు పట్టించుకోలేదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చాకలి ఐలమ్మను గుర్తించి.. జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన తెలంగాణాలో పాత పాలకులు అధికారంలోకి వస్తే మళ్లీ గుడ్డిదీపం పెట్టుకోవాల్సిన రోజులొస్తాయి. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉందామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement