Friday, May 3, 2024

నాంపల్లి కోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గసభ్యుడిగా ..

గోదావరిఖని: హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రోపాలిటన్‌ క్రిమినల్‌ కోర్టులో జరిగిన బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో గోదావరిఖనికి చెందిన న్యాయవాది పులిపాక శ్రీకాంత్‌ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాదులోని కోర్టులో 2013 నుండి న్యాయవాద వృత్తిలో అక్కడే ఆయన కొనసాగుతున్నారు. ఖనికి చెందిన న్యాయవాది హైదరాబాద్లోని నాంపల్లికోర్టు బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక కావడం పట్ల ఈ ప్రాంతంలోని న్యాయవాదులు, మిత్రులు రేణికుంట్ల నరేందర్‌, పులిపాక రవీందర్‌, మారపెల్లి సతీష్‌, కలువల సతీష్‌, మాతంగి ప్రేమ్‌దాస్‌, పి సుదర్శన్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement