Thursday, May 16, 2024

ఉత్తమ సేవలతో ప్రత్యేక గుర్తింపు.. ఏఈ వెంకట్‌కు ఘన సన్మానం

పెద్దపల్లి రూరల్‌, (ప్రభన్యూస్‌): పదవీ కాలంలో పని చేసే ప్రాంతంలో ఉత్తమ సేవలు అందిస్తే ప్రజలు, అధికారుల నుంచి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జడ్పీటీసీ బండారి రామ్మూర్తి పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి మండల రూరల్‌ ఏఈ వెంకట్‌ నారాయణ పెద్దపల్లి డివిజన్‌ కార్యాలయానికి ఏఈ కమర్షియల్‌గా బదిలీ కాగా, మండలంలోని ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ఏఈ వెంకట్‌ నారాయణను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఆయా గ్రామాలలో ఏఈగా ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన విద్యుత్‌ సరఫరాలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈకార్యక్రమంలో పద్దపల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ మాదిరెడ్డి నర్సింహరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఎలగందుల శంకరయ్య, సర్పంచ్‌లు ఆడెపు వెంకటేశం, చుంచు సదయ్య, కన్నం జై, కనపర్తి శ్రీలేఖ ప్రభాకర్‌రావు, ఎద్దు కుమారస్వామి, కొమ్ము శ్రీనివాస్‌, శిలారపు సత్యంతోపాటు విద్యుత్‌ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement