Sunday, April 28, 2024

రోడ్ రోలర్ తో సైలెన్సర్లు తొక్కి.. శబ్ద కాలుష్యంపై సీపీ సీరియస్..

ద్విచక్ర వాహనాలకు బిగించిన ఎక్స్ట్రా సైలెన్సర్లను రోడ్ రోలర్ లతో తొక్కించారు. గురువారం కమిషనరేట్ ఆవరణలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న శబ్ధ‌ కాలుష్యం కలిగించే సైలెన్సర్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలకు ఎక్స్ట్రా సైలెన్సర్లు బిగించి శబ్ధ కాలుష్యానికి పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి వాహనాలపై పోలీసులు దృష్టి సారించారని, ఎక్స్ట్రా సైలెన్సర్ బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement