Monday, April 29, 2024

Peddapalli: మహిళల భద్రతకే షీ టీంలు… డీసీపీ వైభవ్

మహిళల భద్రత కోసం షీ టీంలు పనిచేస్తున్నాయని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలియజేశారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వెంకట పద్మ కన్వెన్షన్ లో పెద్దపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల భద్రత పోలీసుల బాధ్యత అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలున్నాయన్నారు.

మహిళలు, విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పమన్నారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ కు పాల్పడితే జరిమానాలతో పాటు జైలుశిక్ష తప్పదన్నారు. సైబర్ నేరగాళ్ల భారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సిఐ అనిల్ ఎస్సైలు మహేందర్, అష్వినితో పాటు పెద్ద సంఖ్యలో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement