Monday, April 29, 2024

పారిశుధ్య కార్మికుల రక్షణకు చర్యలు..

సుల్తానాబాద్‌: మున్సిపల్‌ పరిధిలో పారిశుధ్య విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల రక్షణ కోసం మాస్కులను పంపిణీ చేయనున్నట్లు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ముత్యం సునిత రమేశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో పద్మ శ్రీనివాస్‌ కార్మికులకు అందించిన మాస్కులను చైర్‌ పర్సన్‌ పంపిణీ చేశారు. కరోనా రెండో వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో కార్మికుల శ్రేయస్సు కోసం దాతలు ముందుకు వచ్చి మాస్కులు అందించడం అభినందనీయమన్నారు. నిరంతరం పారిశుధ్య సిబ్బంది కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈకార్యక్రమంలో కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement