Monday, May 6, 2024

TS: మాదక ద్రవ్య బానిసలను మార్చేందుకు ఆపరేషన్ విముక్తి… ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల, సెప్టెంబర్ 13 (ప్రభన్యూస్) : జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ విముక్తి పేరుతో డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి మాధక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ డాక్టర్స్ తో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, కౌన్సెలింగ్ కోసం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకొంటున్న వారికి దాని నుండి విముక్తి చేయాలనే ఒక మంచి ఉదేశ్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో డి-అడిక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేసి నిపుణులు అయిన సైక్రియాట్రిస్ట్ లతో మత్తు పదార్థాలకు బానిసలుగా మారినటువంటి వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మానేయలేని స్థితిలో ఉన్న వారిని తల్లిదండ్రులు గుర్తించి తమ దగ్గరికి తీసుకువస్తే కౌన్సెలింగ్ నిర్వహించి మాదకద్రవ్యాల నుండి విముక్తి కలిపిస్తామన్నారు. కౌన్సెలింగ్ కోసం తమ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో పేరును నమోదు చేసుకోవాలని ఎస్పీ కోరారు. అలాగే డి-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్ కోసం పేరు నమోదు, ఇతర సమాచారం కోసం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రవికుమార్ ఫోన్ నెంబర్ 8712656410, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఫోన్ నెంబర్ 8712656411 లను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement