Thursday, May 2, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు మన ఊరు- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. పెద్దపల్లి మండలం నిట్టూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మన ఊరు- మన బడి ద్వారా ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు పూర్తిస్థాయిలో సౌకర్యాలు మెరుగుపరిచి కార్పోరేట్‌కు ధీటుగా పాఠశాలలను తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందుతుందని, ఈ మహా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement