Saturday, May 11, 2024

గులాబీ సైనికులకు అండగా తెరాస: పెద్దపల్లి ఎమ్మెల్యే

గులాబీ సైనికులకు తెరాసా పార్టీ అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ మండలం బొంత కుంట పల్లి గ్రామానికి చెందిన టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్త లంక కొండయ్య ప్రమాదవశాత్తు మరణించగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మంజూరైన రెండు లక్షల రూపాయల చెక్కును వారి భార్య లంక భాగ్యమ్మ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఎంపీపీ బాలాజీ రావు, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు, డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, మార్కెట్ ఛైర్మెన్ బుర్ర శ్రీనివాస్,మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత-రమేష్,సూర శ్యామ్,పట్టణాధ్యక్షులు పారుపెల్లి గుణపతి,సర్పంచ్ అనిత – తిరుపతి,అరుణ్,శీలం శంకర్,పక్కీర్ యాదవ్, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement