Sunday, April 28, 2024

సెస్ పాలకవర్గాన్ని సన్మానించిన మంత్రి కేటీఆర్

సెస్ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా సిరిసిల్ల పద్మనాయక కళ్యాణ మండపంలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు పాల్గొని సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో పాటు పాలకవర్గాన్ని సన్మానించారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, శాసన మండలి సభ్యులు ఎల్ రమణ, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, సుంకే రవి శంకర్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, తెలంగాణ పవర్‌లూం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, జిల్లా గ్రంథాలయ‌ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల నారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్లు జిందం కళా చక్రపాణి, రామతీర్థపు మాధవి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement