Friday, May 17, 2024

దళితుల జీవితాల్లో వెలుగులు : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన కల్లెపల్లి శ్రీనివాస్ కి దళిత బంధు ద్వారా మంజూరైన కార్ ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, సర్పంచ్ రాణి-మోహన్, ఎంపీటీసీ పెండ్లి సంపత్,బీ ఆర్ స్ ప్రజా ప్రతినిధులు వెన్నంపల్లి సర్పంచ్ కాసం శ్రీనివాస్ రెడ్డి,తూడి మల్లేష్, లక్ష్మీ నారాయణ, వార్త శ్రీధర్,ఎల్లస్వామి, కూకట్ల నవీన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement