Sunday, May 19, 2024

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాణించాలి.. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి: మంత్రి కొప్పుల

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాణించాలని, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, భారత దేశ ప్రజలందరికీ తెలంగాణ పథకాలు అందాలని తెరాస బీఆర్ఎస్ గా మారిందన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, దళిత బంధు లాంటి పథకాలన్ని దేశమంతా అందాలన్నది కేసీఆర్ ఉద్దేశం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement