Friday, May 3, 2024

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ దగ్గర పూలే విగ్రహానికి ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావులు పూల మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, సుడ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి, కమీషనర్ సేవా ఇస్లావత్ స్థానిక కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్ ఉన్నారు. ఇదే ప్రాంతంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ నరేందర్ రెడ్డి లు పూలే విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement