Thursday, May 2, 2024

దీక్ష విరమణ సమయంలో ఇఫ్తార్ విందులు

రంజాన్ పవిత్ర మాసం లో ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సతీమణి దాసరి పుష్పలత, మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబి గార్డెన్స్ లో ముస్లిం మహిళలకు ఇస్తార్ విందు ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదర, సోదరీమణులు 30 రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారని, ప్రతినిత్యం ఉపవాస దీక్షలు విరమించే సమయంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారన్నారు. రంజాన్ పవిత్ర దినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement